ప్రేమ వైఫల్యంతో యువతి ఆత్మహత్య

student commit to suicide  - Sakshi

టీ.నగర్‌: చిదంబరం సమీపం ప్రేమ వైఫల్యంతో కళాశాల హాస్టల్‌లో విద్యార్థిని ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కడలూరు జిల్లా, చిదంబరం బైపాస్‌రోడ్, సి.ముట్లూరులోని  కళాశాల్లో రెండు వేల మందికి పైగా విద్యార్థులు చదువుకుంటున్నారు. ఈ కళాశాల్లో అరియలూరు జిల్లా, మీన్‌సురుట్టి సమీపం ఓడపేరి గ్రామానికి చెందిన మారియప్పన్‌ కుమార్తె కౌసల్య (21) బీఏ చదువుతోంది. ఈమె కళాశాల సమీపంలోని బీసీ వసతిగృహంలో ఉంటోంది. ఈ స్థితిలో శనివారం ఉదయం కౌసల్య ఉంటున్న గది లోపలివైపు గడియపెట్టి ఉంది. తోటి విద్యార్థినులు తలుపు తట్టినా తెరుచుకోలేదు.

హాస్టల్‌ వార్డెన్‌ తలుపులు పగులగొట్టి లోనికివెళ్లి చూడగా కౌసల్య ఫ్యాన్‌కు ఉరేసుకుని శవంగా వేలాడుతోంది. దీనిపై సమాచారం అందుకున్న కిల్‌లై పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం చిదంబరం ప్రభుత్వ ఆస్పత్రికి పంపారు. కౌసల్య రాసిన ఆత్మహత్యా లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రేమ వైఫల్యంతో ఆత్మహత్యకు పాల్పడుతున్న అందులో పేర్కొంది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top