తల్లిని హత్య చేసిన తనయుడు
మార్కాపురం: భార్యను తిట్టిందనే కారణంతో కుమారుడు తల్లిని కర్రతో కొట్టడంతో మృతి చెందింది. ఈ సంఘటన పట్టణ పోలీసుస్టేషన్ పరిధి ఎస్టేట్ సమీపంలో ఉన్న శాంతినగర్లో ఆదివారం రాత్రి జరిగింది. పట్టణ ఎస్ఐ కోటయ్య కథనం ప్రకారం.. శాంతి నగర్లో నివాసం ఉండే షేక్ అమీనాబీ (69)కి కుమారుడు బాబు ఉన్నాడు. సాయంత్రం అమీనాబీకి కోడలుతో వాగ్వాదం జరిగింది. అమీనాబీ అదే వీధిలో ఉన్న తన చెల్లెలు ఇంటికి వెళ్లింది. ఆగ్రహం చెందిన బాబు అక్కడికి వెళ్లి పక్కనే ఉన్న కర్రతో తల్లిని కొట్టడంతో ఆమె కింద పడిపోయింది. వెంటనే వైద్యశాలకు తీసుకెళ్లగా మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.