ఏడేళ్ల బాలుడి కాళ్లు, చేతులు నరికి..

Seven Year Old Body Found In Uttar Pradesh With Hands And Legs Cut Off - Sakshi

ముజఫర్‌నగర్‌ : ఉత్తరప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. అభంశుభం తెలియని ఏడేళ్ల బాలుడి కాళ్లు చేతులు నరికి అతి కిరాతంగా హత్య చేశారు గుర్తుతెలియని దుండగులు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ష్లామ్లీలోని ఆదర్శ్‌ మండి పోలీసు స్టేషన్‌ పరిధిలో ముక్కలు ముక్కలుగా పడిఉన్న బాలుడి మృత దేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృత దేహన్ని స్వాధీనం చేసుకున్నారు.

ఈ ఘటనపై స్థానిక ఎస్పీ మాట్లాడుతూ..  బాలుడి కాళ్లు, చేతులు, నాలుక నరికి ముక్కలు, ముక్కలుగా పడేసి దుండగులు పారిపోయారు. గుర్తుతెలియని దుండగులపై కేసు నమోదు చేశామన్నారు. మృతదేహన్ని పోస్టుమార్టంకు తరలించినట్లు పేర్కొన్నారు.  మృత దేహాన్ని గత మంగళవారం కిడ్నాపైన బాలుడుగా పోలీసులు అనుమానిస్తున్నారు. దుండగులను పట్టుకునేందుకు నాలుగు పోలీసు బృందాలు రంగంలోకి దిగాయని ఎస్పీ పేర్కొన్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top