ఎక్స్‌ట్రా క్లాసులకు రమ్మని టీచర్‌పై..

School Principal Arrested For Sexually Assaulting Teacher - Sakshi

న్యూఢిల్లీ : స్కూల్‌ టీచర్‌ను బెదిరిస్తూ పలుమార్లు లైంగికదాడికి పాల్పడిన ఓ కీచక ప్రధానోపాధ్యాయుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ సంఘటన ఢిల్లీలోని సరితా విహార్‌లో గురువారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివారాల మేరకు.. రాకేష్ సింగ్‌ అనే వ్యక్తి ఢిల్లీలోని ఓ ప్రైవేట్‌ స్కూల్‌లో ప్రధానోపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. అదే స్కూల్లో టీచర్‌గా పనిచేస్తున్న 27ఏళ్ల  యువతిపై అతడి కన్నుపడింది. ఓ రోజు స్కూలు ముగిసిన తర్వాత విద్యార్థులకు ఎక్స్‌ట్రా క్లాసులు చెప్పటానికి రావాలని ఆమెను ఆదేశించాడు. ఎక్స్‌ట్రా క్లాసుల నిమిత్తం వచ్చిన ఆమెను తన గదిలోకి తీసుకెళ్లాడు. కూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలిపి ఆమెకు ఇచ్చాడు. అది తాగి స్ప్రహ కోల్పోయిన వెంటనే ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు.

ఈ దృశ్యాలను తన సెల్‌ఫోన్‌లో చిత్రీకరించాడు. విషయం బయటకు చెబితే వీడియోను సోషల్‌ మీడియాలో వైరల్‌ చేస్తానంటూ భయపెడుతూ ఆమెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. అదే స్కూల్లో పని చేస్తున్న మరో ఇద్దరు మహిళా టీచర్లు రాకేష్‌కు సహకరించటం గమనార్హం. వారు కూడా ఆమెను అతడితో గడపాలంటూ బలవంతపెట్టేవారు. రాకేష్‌ వికృత చేష్టలు భరించలేకపోయిన ఆమె కుటుంబసభ్యులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రాకేష్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా నేరం చేసినట్లు అంగీకరించాడు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top