ఆర్టీసీ బస్సు చోరి.. కానిస్టేబుల్కు తీవ్రగాయాలు
సాక్షి, కర్నూలు: జిల్లాలోని నందికొట్కూరు ఆర్టీసీ బస్టాండ్లో ఓ దొంగ బస్సు చోరీకి యత్నించాడు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో బస్సును పట్టుకోవడానికి వెళ్లిన హెడ్ కానిస్టేబుల్ రమణను ఆదొంగ బస్సుతో ఢీకొట్టి పరారయ్యాడు. దీంతో కానిస్టేబుల్ కు తీవ్ర గాయాలు అయ్యాయి. అతనిని వెంటనే సమీప ఆసుపత్రికి తరలించారు. నందికొట్కూరులోని బల్లవరం వద్ద బుస్సును గుర్తించిన పోలీసులు దొంగను అదుపులోకి తీసుకున్నారు.