ఘోర రోడ్డుప్రమాదం: జాతీయ రహదారిపై అతివేగంతో..
సాక్షి, నల్గొండ: కట్టంగూరు మండలంలోని జాతీయ రహదారిపై ఘోర రోడ్డుప్రమాదం చోటు చేసుకుంది. అతివేగంగా వెళుతున్న ఓ ఆర్టీసీ బస్సు సిమెంట్ ట్యాంకర్ను ఢీ కొన్న ఘటనలో ఇద్దరు మృతి చెందగా 25 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన ఆదివారం రాత్రి ముత్యాలగూడెం వద్ద జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. విజయవాడ గవర్నర్పేటకు చెందిన ఆర్టీసీ బస్సు స్పెషల్ సీర్వసుగా హైదరాబాద్కు బయలుదేరింది. సూర్యాపేట వరకు స్పీడ్ లిమిట్ను పాటించిన బస్సు డ్రైవర్ మారటంతో అతి వేగంతో ముత్యాలగూడెం వద్ద ఓ వాహనాన్ని ఓవర్టెక్ చేయటానికి ప్రయత్నించి ముందుగా ఉన్న సిమెంట్ ట్యాంకర్ లారీని ఎడమ వైపు ఢీకొట్టింది.
దీంతో కండక్టర్.. బస్సు, లారీ మధ్యలో ఇరుక్కొని మృతి చెందగా, ప్రయాణికుల్లో ఓ మహిళ మృత్యువాత పడింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ వారిని నార్కట్పల్లి కామినేని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.