విశాఖలో దొంగలముఠా అరెస్ట్

సాక్షి, విశాఖ: విశాఖలో అంతరాష్ట్ర దొంగల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఇటీవల నగరంలో భారీ దొంగతనాలకు ఈ ముఠా పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. దీంతో నిఘా పెట్టిన పోలీసులు ఆరిలోవకు సమీపంలో బీఆర్డీఎస్‌ రోడ్‌లో నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

నిందితుల్లో 8 మంది బిహార్‌కు, 9 మంది ఆరిలోవ ప్రాంతానికి చెందిన వ్యక్తులుగా గుర్తించారు. పట్టుబడ్డ నిందితుల నుంచి 3 నాటు తుపాకులు, ఒక బటన్‌ నైఫ్‌, మూడున్నర కేజీల గంజాయి, 10 తులాల బంగారం, 1.2 కేజీల వెండి, రెండు బైక్‌లు, 7 రౌండ్ల బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. 
 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top