తోటల్లో వ్యభిచారం.. అధికులు కాలేజీ స్టూడెంట్సే
సాక్షి, శ్రీకాకుళం : జిల్లాలో వ్యభిచార కార్యాకలాపాల గుట్టు రట్టయింది. జాతీయ రహదారి ప్రక్కన మామిడి తోటల్లో వ్యభిచారానికి పాల్పడుతున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం తామరాపల్లి గ్రామ 16వ నెంబర్ జాతీయ రహదారి ప్రక్కన ఉన్న మామిడి తోటల్లో వ్యబిచారం జరుగుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో రంగంలోకి దిగిన స్పెషల్ బ్రాంచ్ పోలీసులు శనివారం అర్థరాత్రి దాడులు నిర్వహించారు. వ్యభిచారానికి పాల్పడుతున్న 20మంది విటులను, ముగ్గురు పడతులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పట్టుబడిన విటులలో ఎక్కువమంది కాలేజీ స్టూడెంట్స్ ఉండటం గమనార్హం. పడతులను రాజమండ్రికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.
సంబంధిత వార్తలు