దారుణం : మహిళ, చిన్నారిని హతమార్చి..

UP Police Says Charred Bodies Of Woman And Seven Year Old Found In Forest - Sakshi

లక్నో : ఉత్తరప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. ఓ మహిళను, చిన్నారిని గుర్తు తెలియని దుండగులు పాశవికంగా హతమార్చారు. వివరాలు... లక్ష్మీపూర్‌ ఖేరీ సమీపంలోని మైలానీ అడవుల్లో పోలీసులు శుక్రవారం రాత్రి రెండు శవాలను స్వాధీనం చేసుకున్నారు. 30 ఏళ్ల మహిళతో పాటు ఏడేళ్ల చిన్నారిని హత్య చేసిన దుండగులు వారి శవాలను ముక్కలుగా నరికి ఆపై తగులబెట్టారని తెలిపారు. పాక్షికంగా కాలిన వారి మృతదేహాల దగ్గర సెల్‌ఫోన్‌, టిఫిన్ బాక్స్‌‌, కాలిన టైర్లు తదితర సామాగ్రి లభించిందని.. వీటి ఆధారంగా బాధితులు, నేరస్తులు ఎవరన్న దానిపై విచారణ జరుపుతామని  గోలా డీఎస్పీ అభిషేక్‌ ప్రతాప్‌ పేర్కొన్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top