రేవ్పార్టీ కలకలం.. 18మందిపై కేసులు
సాక్షి, కర్నూలు : నగరంలో సంచలనం కలిగించిన రేవ్పార్టీ కేసులో పోలీసులు నష్టనివారణ చర్యలకు దిగారు. ఇందులో భాగంగా రేవ్పార్టీకి సంబంధించిన 18 మందిపై పలు కేసులు నమోదు చేశారు. మద్యం మత్తులో యువతులపై లౌంగిక వేధింపులకు పాల్పడ్డారని కేసులు నమోదు చేశారు. పార్టీ జరిగిన రోజు సీసీటీవి పుటేజ్ ద్వారా ఇప్పటికే ఏడుగురు నిందితులను గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.
మరో 11 మంది పరారీలో ఉన్నారని, వారి కోసం గాలింపు కొనసాగుతోందని, నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. అయితే పార్టీ జరిగిన రోజు వ్యవసాయ అధికారులు సైతం ఇందులో పాల్గొన్నారని గుసగుసలు రావడంతో వారి ప్రమేయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. తప్పతాగి రేవ్ పార్టీలో నానాహంగామా సృష్టించిన వన్ టౌన్ సీఐ కృష్ణయ్యను ఇప్పటికే ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు.