నలుగురు సైబర్ నేరగాళ్ల అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: ఇన్సూరెన్స్ పాలసీలకు బోనస్ వచ్చిందని ఆన్లైన్లో డబ్బులు వేయించుకుని మోసం చేస్తున్న నలుగురిని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. ఇన్సూరెన్స్ పాలసీలకు రూ. 50 లక్షల బోనస్ వచ్చిందంటూ కొందరు వ్యక్తులు పాలసీదారులకు ఫోన్లు చేశారు. అందుకు పన్నుల కింద రూ.15 లక్షలు చెల్లించాలని ఆన్లైన్లో డబ్బులు వేయించుకున్నారు.
మోసం చేశారని మలక్పేటకు చెందిన వీరేంద్రకుమార్ అనే వ్యక్తి సీసీఎస్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఢిల్లీ, శ్రీనగర్కు చెందిన మహేష్ కుమార్ యాదవ్, నితిన్ గుప్తా, ప్రిన్స్, నాగేశ్వర్ గుప్తాలను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.