భార్య పుట్టింటికి వెళ్లిందని..
సాక్షి, ఎల్లారెడ్డి: కుటుంబ కలహాలతో యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన పట్టణంలో శనివారం చోటుచేసుకుంది. ఎస్ఐ శ్వేత తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని గాంధీనగర్ కాలనీలో నివాసముంటున్న విజయ్కుమార్(28) తన భార్యతో గొడవ పడ్డాడు. దీంతో భార్య పుట్టింటికి వెళ్ళి పోవడంతో మనస్తాపానికి గురై ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్ఐ తెలిపారు. కుటుంబ సభ్యుల ఫి ర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు ఆమె తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారన్నారు.