గాంధీఆస్పత్రి భవనంపై నుంచి దూకి

Nursing Student Commits Suicide in Gandhi Hospital - Sakshi

నర్సింగ్‌ విద్యార్థి ఆత్మహత్య

గాంధీఆస్పత్రి : సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రి భవనంపై నుంచి కిందికి దూకి నర్సింగ్‌ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన సోమవారం చోటు చేసుకుంది.  చిలకలగూడ డీఐ నర్సింహరాజు, ఎస్‌ఐ రాజునాయక్‌ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.. గుజరాత్‌కు చెందిన గమిత్‌ రోహన్‌బాయ్‌ (22) నాగారంలోని ఓ ప్రైవేటు మాస్టల్‌లో ఉంటూ  గుడుంకుంటలోని విజయ హెల్త్‌కేర్‌ అకడమిక్‌ సొసైటీ ఆధ్వర్యంలో విజయ స్కూల్‌ ఆఫ్‌ నర్సింగ్‌లో జీఎన్‌ఎం కోర్సు చదువుతున్నాడు. క్లినికల్స్‌ కోసం ఆదివారం గాంధీ ఆస్పత్రికి వచ్చి నైట్‌ డ్యూటీ చేశాడు.

సోమవారం మధ్యాహ్నం అతను ఆస్పత్రి ప్రధాన భవనం నాల్గవ అంతస్తు నుంచి కిందికి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తలకు తీవ్రగాయం కావడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పలు సబ్జెక్టుల్లో ఫెయిల్‌ కావడంతో రోహన్‌బాయ్‌ మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు దర్యాప్తులో తేలింది. మృతుని తల్లితండ్రులతోపాటు నర్సింగ్‌ స్కూలు యాజమాన్యానికి సమాచారం అందించినట్లు పోలీసులు తెలిపారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top