ఇంట్లో నిద్రిస్తున్న మహిళపై హత్యాయత్నం

Murder Attempt On Woman In Chennai - Sakshi

టీ.నగర్‌ : చెన్నై మైలాపూరులో ఇంట్లో నిద్రిస్తున్న మహిళ గురువారం రాత్రి కత్తిపోట్లకు గురైంది. మైలాపూరు లాలాతోట్టంకు చెందిన కర్పగం (40) గురువారం రాత్రి ఇంట్లో నిద్రకు ఉపక్రమించింది. రాత్రి 11.30 గంటల సమయంలో ఇంట్లోకి ప్రవేశించిన గుర్తు తెలియని వ్యక్తులు నిద్రిస్తున్న కర్పగంపై కత్తులతో దాడి చేసి పరారయ్యారు.ఆమెను రాయపేట ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు. కర్పగం కుమారుడు వసంతకుమార్‌కు  భార్య బంధువులతో అసభ్యంగా మాట్లాడినట్లు సమాచారం. దీంతో ఆగ్రహించిన ప్రీతి మామ కుమారుడు అరుణ్‌ అతని అనుచరుడైన శరవణన్‌ మరో ఇద్దరితో కలిసి వసంతకుమార్‌ను హత్య చేసేందుకు ఇంట్లో చొరబడినట్లు తెలిసింది. వసంత్‌కుమార్‌ అని పొరబడి కర్పగంపై కత్తులతో దాడి చేశారు. పరారీలో ఉన్న అరుణ్, శరవణన్‌ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top