వార్డెన్‌పై ఫిర్యాదు చేసిందని...

MP Minor Girl Evicted From Hostel For Complaining About Molestation - Sakshi

భోపాల్‌ : హాస్టల్‌ వార్డెన్‌ తనను వేధిస్తున్నాడంటూ ఫిర్యాదు చేసిన బాలిక పట్ల పాఠశాల యాజమాన్యం అమానుషంగా ప్రవర్తించింది. బాలికతో పాటు అదే పాఠశాలలో చదువుతున్న ఆమె ఇద్దరు సోదరులను కూడా బహిష్కరించింది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది.

వివరాలు.. గిరిజన తెగకు చెందిన ఓ బాలిక దామోహ్‌లోని క్రిస్టియన్‌ మిషనరీ పాఠశాలలో చదుకుంటోంది. ఈ క్రమంలో అక్కడే హాస్టల్‌లో బస చేస్తున్న ఆమెపై వార్డెన్‌ పలుమార్లు వేధింపులకు పాల్పడ్డాడు. దీంతో ఆమె యాజమాన్యానికి ఫిర్యాదు చేసింది. అయితే అతడిపై చర్యలు తీసుకోకుండా బాలికను, ఆమె సోదరులను పాఠశాల నుంచి తొలగిస్తున్నట్లు యాజమాన్యం పేర్కొంది. దీంతో బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై స్పందించిన దామోహ్‌ ఎస్పీ వేల్‌వంశీ... నిందితుడు, పాఠశాల యాజమాన్యంపై తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top