తల్లీ, కూతురు అదృశ్యం
చందానగర్: కుటుంబ కలహాల కారణంగా ఓ మహిళ కుమార్తెతో సహా అదృశ్యమైన సంఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. శాంతినగర్కు చెందిన శ్రావణి (20) హౌస్ కీపింగ్ పనిచేసేది. గత కొంత కాలంగా ఆమెకు భర్త చందుతో గొడవలు జరుగుతున్నాయి. దీంతో మనస్తాపానికిలోనైన శ్రావణి ఈ నెల 12న కుమార్తె దీపిక (ఏడాదిన్నర)తో బయటికి వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు ఆమె కోసం గాలింపు చేపట్టినా ఆచూకీ లేకపోవడంతో చందానగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.