వివాహితపై లైంగిక దాడి : సోషల్ మీడియాలో వీడియో
జైపూర్ : రాజస్ధాన్లోని పాలి జిల్లాలో వివాహితపై ఐదుగురు వ్యక్తులు సామూహిక లైంగిక దాడికి పాల్పడి ఆ నేరానికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారని పోలీసులు వెల్లడించింది. ఐదుగురు నిందితుల్లో నలుగురిని సోమవారం అరెస్ట్ చేశామని చెప్పారు. గత నెల 26న ఫ్రెండ్తో కలిసి గుడికి వెళ్తుండగా ఐదుగురు వ్యక్తులు తనపై లైంగిక దాడికి తెగబడ్డారని 30 ఏళ్ల వివాహిత ఫిర్యాదు చేసిన మరుసటి రోజే నిందితులను అదుపులోకి తీసుకున్నామని పోలీసులు చెప్పారు. బాధితురాలి ఫిర్యాదుపై నలుగురు నిందితులు జితేంద్ర భట్, గోవింద్ భట్, దినేష్ భట్, మహేష్ భట్లను అరెస్ట్ చేశామని మరో నిందితుడు సంజయ్ భట్ కోసం గాలిస్తున్నామని అన్నారు. నిందితులను ప్రశ్నించిన అనంతరం కోర్టు ఎదుట హాజరుపరుస్తామని, మహిళను వైద్యపరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించామని పోలీసులు తెలిపారు. బాధితురాలి భర్త కూలి పనులకు వెళుతుంటాడని పోలీసులు వెల్లడించారు.