వశీకరణ శక్తి కోసం రాక్షసంగా..

Married Man kills Owl To Perform Black Magic For Attracting Woman - Sakshi

నచ్చిన మహిళ కోసం గుడ్లగూబతో తాంత్రిక పూజలు

యూట్యూబ్‌ వీడియో ప్రేరణతో దారుణానికి ఒడిగట్టిన నిందితుడు

న్యూఢిల్లీ : వశీకరణ శక్తి కోసం రాక్షసంగా గుడ్లగూబను చంపి తాంత్రిక పూజలు నిర్వహించాడు ఓ 40 ఏళ్ల వ్యక్తి. తనకు నచ్చిన మహిళను లోబరుచుకోవాలనే ఉద్దేశంతో చేసిన ఈ వ్యవహారం బయటకు పొక్కడంతో కటకటాలపాలయ్యాడు. ఈ ఘటన న్యూఢిల్లీ సుల్తాన్‌పురిలో చోటుచేసుకుంది. జంతు సంరక్షణ బోర్డు ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడు ట్రక్‌ డ్రైవర్‌ కన్హయ్యగా గుర్తించి అతని ఇంటిపై దాడి చేశారు. ఆ ఇంట్లో దీపావళి తర్వాత తాంత్రిక పూజలు జరిగినట్లు.. చనిపోయి ఉన్న గుడ్లగూబను కూలర్‌లో గుర్తించారు.

నిందితుడు కన్హయ్య యూట్యూబ్‌లోని ఓ వీడియో ద్వారా ఈ దారుణానికి ఒడిగట్టాడని పోలీసులు తెలిపారు. అతనికి పెళ్లై ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారని, కానీ నచ్చిన మహిళను లోబరుచుకోవాడనికి, ఆమెను హిప్నటైజ్‌ చేసే శక్తి కోసం ఈ పని చేసినట్లు పేర్కొన్నారు. నిందితుడు మాత్రం పొంతన లేని సమాధానాలు చెబుతున్నాడని దర్యాప్తు జరుగుతుందన్నారు. గుడ్లగూబ పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో మాత్రం దాని శరీరంపై సూదులతో గుచ్చిన గాయలున్నట్లు తేలిందన్నారు. అతని తాంత్రిక పూజలు వారి కుటుంబానికి కూడా తెలుసని, అతని భార్య కూడా ఈ వశీకరణ శక్తి కోసం ప్రయత్నించిదని పేర్కొన్నారు.
 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top