జీవన భారం మోయలేక వెళ్లిపోతున్నాం

Married Couple Commits Suicide in Hyderabad - Sakshi

ఆర్థిక ఇబ్బందులు తాళలేక దంపతుల ఆత్మహత్య

హస్తినాపురం: ఆర్థిక ఇబ్బందులు తాళలేక దంపతులు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన వనస్థలిపురం పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. రంగారెడ్డి జిల్లా మాల్‌ కేశంపల్లి గ్రామానికి చెందిన వెంకట్‌రెడ్డి (35), నిఖిత (32)లు భార్యాభర్తలు. వీరికి ఒక బాబు యశ్వంత్‌రెడ్డి (2) ఉన్నాడు. కొంత కాలంగా బీఎన్‌రెడ్డినగర్‌లో అద్దె ఇంట్లో నివాసముంటున్నారు. వెంకట్‌రెడ్డి వృత్తిరీత్యా ప్రైవేటు ఉద్యోగి. కొన్ని రోజులుగా ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో మంగళవారం ‘తమ చావుకు ఎవరూ బాధ్యులు కాదు.. జీవించడం ఇష్టంలేకనే చనిపోతున్నాం.. మా బాబుని మంచిగా చూసుకోండి.. దయ చేసి ఎవరూ బాధపడకండి’ అంటూ సూసైడ్‌ నోట్‌ రాసి ఇంట్లోని ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top