రాఘవేంద్ర థియేటర్ వద్ద దారుణ హత్య
సాక్షి, విజయవాడ : నగరంలోని రాఘవేంద్ర థియేటర్ వద్ద ఆదివారం అర్థరాత్రి దారుణ హత్య జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు చందా వెంకటేశ్వర రాజు(55)ను అతి దారుణంగా పొడిచి చంపారు. సంఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృత దేహాన్ని ఆసుపత్రికి తరలించారు.
రాజు శ్రీనగర్ కాలనీలో నివాసం ఉంటున్నట్లు గుర్తించామని తెలిపారు. రాజు శరీరంపై కత్తిపోట్లు ఉన్నాయని, తలకు పెద్ద గాయం కావడం వల్లే మృతి చెంది ఉంటాడని అనుమానిస్తున్నట్లు వెల్లడించారు. డబ్బుల కోసమే హత్య జరిగి ఉంటుందని భావిస్తున్నట్లు చెప్పారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.