యువతులను బంధించి.. వీడియోలు తీసి..
లక్నో : ఉత్తరప్రదేశ్లో దారుణ ఘటన వెలుగుచూసింది. ఓ మృగాడు ఇద్దరు యువతులపై అత్యాచారానికి పాల్పడగా.. అతడి భార్య ఆ అకృత్యాన్ని కెమెరాలో చిత్రీకరించింది. వివరాలు.. సంజీవ్ లోహన్ అనే వ్యక్తి న్యూ మండీ ఏరియాలో ఇద్దరు యువతులను బంధించాడు. అనంతరం వారిపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత మరికొంత మంది వ్యక్తులు కూడా వారిపై ఘాతుకానికి తెగబడ్డారు.
ఈ దారుణాన్ని సంజీవ్ లోహన్ భార్య రీటా లోహన్ వీడియోలు తీసింది. వ్యభిచార వృత్తిలోకి దిగకపోతే ఈ వీడియోలు బహిర్గతం చేస్తామంటూ భార్యాభర్తలిద్దరు వారిని బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టారు. ఎలాగోలా వారి చెర నుంచి తప్పించుకున్న బాధితులు పోలీసులను ఆశ్రయించారు. సంజీవ్, రీటాలపై ఫిర్యాదు చేయగా గురువారం పోలీసులు వారిని అరెస్టు చేశారు.
సంబంధిత వార్తలు
మరిన్ని వార్తలు