మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వలేదని..
ఢిల్లీ : మద్యానికి బానిస అయిన ఇద్దరు వ్యక్తులు దారుణానికి ఒడిగట్టారు. తాము మద్యం కొనుగోలు చేయడానికి డబ్బులు ఇవ్వలేదని పక్కింటి వ్యక్తిని హతమార్చారు. ఈ ఘటన ఢిల్లీ షకుర్పూర్లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. షకుర్పూర్ పార్క్ సమీపంలోని పొదల్లో పోలీసులు అనుమానస్పద మృతదేహాన్ని గుర్తించారు. మృతున్ని అదే ప్రాంతానికి చెందిన చందర్ ఖాన్గా గుర్తించారు. బాధితుని సోదరి ఇచ్చిన సమాచారం ఆధారంగా విచారణ చేపట్టారు. గిరిరాజు, పవన్లు కలిసి చందర్ ఖాన్ను హతమార్చినట్టు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు.
ఈ ఘటనపై పోలీసులు మాట్లాడుతూ.. మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వకపోవడంతోనే ఈ ఘాతునికి పాల్పడినట్టు నిందితులు అంగీకరించారని వెల్లడించారు. నిందితుల వద్ద నుంచి రక్తపు మరకలతో ఉన్న దుస్తులను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు.
సంబంధిత వార్తలు