గొంతుపై గాట్లతో రైలుపట్టాలపై యువకుడు

Man Injured In Mahabubnagar - Sakshi

మహబూబ్‌నగర్‌ క్రైం : గొంతు కోసుకుని, మణికట్టు వద్ద నాలుగు చోట్ల కోసి ఉన్న గాయాలతో ఓ యువకుడు అపస్మారక స్థితిలో రైలు పట్టాలపై పడి ఉండటం స్థానికంగా కలకలం రేపింది. మండలంలోని కోడూరు సమీపంలో ఆదివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. రైల్వే ఎస్‌ఐ రాఘవేందర్‌ కథనం ప్రకారం.. గద్వాలకు చెందిన వినోద్‌(20) ఆదివారం మధ్యాహ్నం మండలంలోని కోడూర్‌ సమీపంలో రైల్వేపట్టాలపై సేవింగ్‌ చేసుకునే బ్లేడ్‌తో గొంతు కోసుకోవడంతోపాటు చేతి మణికట్టు దగ్గర నాలుగు చోట్ల కోసుకుని ఆత్మహత్యాయత్నం చేసినట్లు తెలిపారు.

రక్తం అధికంగా పోవడంతో అపస్మారక స్థితిలో రైలుపట్టాలపై పడి ఉన్నాడని, రైల్వేగేట్‌ కాపలదారు గమనించి పట్టాలపై నుంచి పక్కకు తీసి.. 108కు ఇచ్చిన సమాచారంతో ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. గద్వాలకు చెందిన వినోద్‌ గత కొంతకాలంగా హైదరాబాద్‌లో క్యాటరింగ్‌ చేసే ఓ సంస్థలో పని చేస్తున్నాడన్నారు. అయితే మహబూబ్‌నగర్‌ ఎందుకు వచ్చాడు.. ఆత్మహత్యయత్నాం చేయాల్సిన అవసరం ఏముంది అనే విషయాలు తెలియాల్సి ఉంది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే ఎస్‌ఐ పేర్కొన్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top