ప్రియురాలి తలపై సుత్తితో కొట్టిన వ్యక్తి అరెస్ట్
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధానిలో మహిళలపై వేధింపులు, దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తనతో సంబంధం కొనసాగించేందుకు నిరాకరించిన మహిళ తలపై సుత్తితో కొట్టిన యువకుడిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడని 22 ఏళ్ల నిషాంత్ సైనీగా పోలీసులు గుర్తించారు. ఎనిమిదేళ్లుగా తనకు పరిచయం ఉన్న మహిళను తనతో సంబంధం కొనసాగించాల్సిందిగా నిందితుడు కోరగా బాధితురాలు నిరాకరించడంతో ఆమె తలపై నిషాంత్ సుత్తితో బలంగా పలుమార్లు కొట్టాడు.
మహిపాల్పూర్లోని హోటల్లో ఇరువురి మధ్య జరిగిన వాగ్వాదం నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకుందని పోలీసులు చెప్పారు. బాధితురాలిని ఆస్పత్రికి తరలించిన పోలీసులు నిషాంత్ను అరెస్ట్ చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
సంబంధిత వార్తలు