చిటికెన వేలుకు ఆపరేషన్‌.. వ్యక్తి మృతి

Man Dies After Operation In Virinchi Hospital - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : విరించి ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. ఆసుపత్రి వైద్యులు ఓ వ్యక్తి చిటికెన వేలుకు ఆపరేషన్‌ నిర్వహించిన మరుసటిరోజే అతడు మృత్యువాత పడ్డాడు. ఈ సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సింగరేణికి చెందిన సంగీత్‌ రావు(58) అనే వ్యక్తి కాలు చిటికెన వేలుకు ఆపరేషన్‌ చేయించుకోవటానికి హైదరాబాద్‌లోని విరంచి ఆసుపత్రిలో చేరాడు. శనివారం ఆసుపత్రి వైద్యులు ఆయన కాలి చిటికెన వేలుకు ఆపరేషన్‌ నిర్వహించారు. ఆపరేషన్‌ చేసిన మరుసటిరోజే సంగీత్‌ రావు మృతిచెందాడు.

ఆదివారం మృతుని కుటుంబ సభ్యులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా విరించి ఆసుపత్రి యాజమాన్యం మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించింది. అయితే ఆపరేషన్‌ ముందురోజు ఐసీయూలో వైద్యులు హంగామా చేసినట్లు తెలుస్తోంది. బాధిత కుటుంబసభ్యులు ఆసుపత్రి వైద్యులను ప్రశ్నించగా నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. దీంతో వారు యాజమాన్యంతో వాగ్వాదానికి దిగారు. విరించి ఆసుపత్రి వద్ద ఎలాంటి గొడవలు జరగకుండా భారీగా పోలీసులు మోహరించారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top