అన్నయ్య అస్థికలు కలపడానికి వస్తూ..

Man died in road accident - Sakshi

రాజమహేంద్రవరం రూరల్‌: అన్నయ్య అస్థికలు కలపడానికి అన్నకుమారుడితో బైక్‌పై వస్తున్న వ్యక్తిని లారీ వెనుక నుంచి ఢీకొట్టిన సంఘటన గురువారం లాలాచెరువు సెంటర్‌లో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో తీవ్రగాయాలైన ఏలేశ్వరం మండలం సిరిపురం గ్రామానికి చెందిన భడిపాటి ప్రకాశరావు(67)మృతి చెందగా, వెంకటరమణను చికిత్స నిమిత్తం కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసుల కథనం ప్రకారం.. ఏలేశ్వరం సిరిపురంకి చెందిన భడిపాటి వెంకటరమణ తండ్రి గత నెల 25న మృతిచెందారు.

అతడి అస్థికలు గోదావరిలో నిమజ్జనం చేసేందుకు వెంకటరమణ, చిన్నాన్న ప్రకాశరావును తీసుకుని బైక్‌పై రాజమహేంద్రవరం బయలుదేరారు. గురువారం ఉదయం ఏడు గంటల సమయంలో లాలాచెరువు సెంటర్‌ వచ్చేసరికి వేమగిరి వైపు వెళుతున్న లారీ అతివేగంగా ఢీకొట్టింది. ఈ ప్ర మాదంలో గాయపడ్డ ప్రకాశరావు, వెం కటరమణలను రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ప్రకాశరావు చికిత్స పొందు తూ మృతిచెందగా, మెరుగైన చికిత్స ని మిత్తం వెంకటరమణను కాకినాడ ప్ర భుత్వాసుపత్రికి తరలించారు. ఈమేర కు బొమ్మూరు పోలీస్‌స్టేషన్‌ ఎస్సై భా నుప్రసాద్‌ కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top