విద్యుదాఘాతంతో భర్త మృతి

Man died by electric shock In Suryapet - Sakshi

వైరుపై దుస్తులు ఆరవేస్తుండగా ప్రమాదం

సూర్యాపేట మండలం కుప్పిరెడ్డిగూడెంలో ఘటన

సూర్యాపేటరూరల్‌ : విద్యుత్‌ షాక్‌కు గురైన భార్య ను కాపాడబోయే ప్రయత్నంలో భర్తకు కూడా షాక్‌ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన సూర్యాపేట మండలం కేటీ అన్నా రం గ్రామ ఆవాసం కుప్పిరెడ్డిగూడెం గ్రామంలో ఆదివారం జరిగింది. పోలీసులు, స్థానికులు తెలి పిన వివరాల ప్రకారం.. కుప్పిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన ముల్కలపల్లి సైదులు (29), భవాని దంపతులు.

భవాని రోజూ మాదిరిగానే దుస్తులు ఉతికిన అనంతరం ఆర బెట్టేందుకు ఇంటి ఆవరణలో కట్టిన జే వైరుపై దుస్తులను వేసేంది. అప్పటికే జే వైరుకు విద్యుత్‌తీగ ఆనుకోవడంతో విద్యుత్‌షాక్‌కు గురైంది. భవాని కేకలు వేయడంతో ఇంట్లో ఉన్న సైదులు వచ్చి భార్యను విద్యుత్‌షాక్‌ నుంచి తప్పించే ప్రయత్నం చేయగా విద్యుత్‌వైరు తగిలి సైదులు అక్కడికక్కడే మృతి చెందాడు.

భార్య భవాని ప్రమాదం నుంచి బయటపడింది. గమనించిన స్థానికులు సైదులను ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేసే ప్రయత్నంలో అప్పటికే  మృతి చెందాడు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు.

మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం  సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుని మేనమామ కనుకు యాద య్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సూర్యాపేటరూరల్‌ ఎస్‌ఐ శ్రీనువాస్‌యాదవ్‌ తెలిపారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top