మహిళ వేధింపులు భరించలేక వ్యక్తి ఆత్మహత్య

Man Committed Suicide For Women Harassment In Maharashtra - Sakshi

ముంబై : మహిళ వేధింపులు భరించలేక ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. పోలీసులు కథనం మేరకు.. పర్భాని జిల్లాకి చెందిన సచిన్‌ మిత్కారి(38) ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో పనిచేస్తున్నాడు. అక్కడే పనిచేస్తున్న ఓ మహిళ సచిన్‌తో సన్నిహితంగా ఉండసాగారు. అతనికి పెళ్లి అయిందని తెలిసి కూడా అక్రమ సంబంధం కొనసాగించాలని కోరారు. దీనికి సచిన్‌ నిరాకరించడంతో అతన్ని వేధించడం మొదలుపెట్టారు. తాను చెప్పినట్లు వినకపోతే  లైంగికంగా వేధింపుల కేసు పెడతానని బెదిరించారు.

సదరు మహిళా వేధింపులు రోజు రోజుకి హెచ్చుమీరడంతో భరించలేక ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకి పాల్పడ్డాడు. ఇంట్లో ఫ్యాన్‌కి వేలాడుతున్న మృతదేహన్ని చూసి స్థానికులు పోలీసులకి సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృత దేహన్ని పోస్ట్‌మార్టంకి తరలించారు. సచిన్‌ జేబులో లేఖ లభించిందని, మహిళ వేధింపులు భరించలేకనే ఆత్మహత్యకి పాల్పడినట్లు లేఖలో ఉందని పోలీసులు తెలిపారు. లేఖ ఆధారంగా విచారణ చేపడుతామని పోలీసులు పేర్కొన్నారు.
 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top