పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య

Man Committed Suicide - Sakshi

జఫర్‌గఢ్‌ వరంగల్‌ : గ్రామంలో జరిగే కాటమయ్య, దుర్గమ్మ పండుగ  తాను ఒక్కడినే చేసుకోవాల్సి వచ్చిందని తీవ్ర మనోవేదనకు గురైన ఓ వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహ్యతకు పాల్పడిన సంఘటన మండలంలోని కూనూర్‌ గ్రామంలో శనివారం సాయంత్రం చోటు చేసుకుంది. బాధిత కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన ప్రకారం...గ్రామానికి చెందిన గడ్డం అంజయ్య (56) అనే వ్యక్తి తన కుటుంబ సభ్యులతో కలసి బతుకుదెరువు కోసం హైదరాబాద్‌కు వెళ్లాడు.

గత కొన్నేళ్ల నుంచి అక్కడనే జీవనం సాగిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో ఇటీవల గ్రామంలో జరిగిన కాటమయ్య, దుర్గమ్మ పండుగ కుటుంబ సభ్యులతో కలసి చేసుకోవాల్సి ఉండగా  కోడలు అనారోగ్యం వల్ల తాను ఒక్కడనే పండుగ చేసుకోవాల్సి వచ్చిందని అంజయ్య తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. ఇదే విషయాన్ని గ్రామస్తుల వద్ద పేర్కొంటూ తన ఆవేదన వ్యక్తం చేశాడు.

ఈ క్రమంలో మరింత మనోవేదనకు గురైన అంజయ్య తీవ్ర మనస్తాపంతో ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు ఎవరు లేకపోవడంతో అంజయ్య మృతి చెందిన విషయాన్ని అలస్యంగా గ్రామస్తులు గుర్తించారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. కాగా బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకోని దర్యాప్తు  చేస్తున్నట్లు ఎస్సై రవి తేలిపారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top