కుటుంబాన్ని హతమార్చి, ఆత్మహత్య
చండీగఢ్ : పంజాబ్లో ఓ యువకుడు దారుణానికి పాల్పడ్డాడు. తన కుటుంబ సభ్యులపై విచక్షణా రహితంగా కాల్పులకు పాల్పడి వారిని హతమార్చాడు. అనంతరం తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలు.. సందీప్ సింగ్(27) అనే వ్యక్తి తన కుటుంబ సభ్యులతో పాటు నథువాల్ గ్రామంలో నివసిస్తున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం అర్ధరాత్రి అకస్మాత్తుగా కాల్పులకు తెగబడ్డాడు. తన తాతయ్య, అమ్మా, నాన్నా, సోదరి ఆమె మూడేళ్ల కూతురిని తుపాకీతో కాల్చి...అనంతరం తన శరీరంలోనూ బుల్లెట్లు దించుకున్నాడు.
కాగా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని...విచారణ జరుపుతున్నట్లు పేర్కొన్నారు. సందీప్ తాతయ్య శరీరంలో లభించిన బుల్లెట్ల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.