పెళ్లి కాలేదనే మనస్తాపంతో యువకుడి ఆత్మహత్య
చిత్తూరు, ములకలచెరువు: పెళ్లి కాలేదని జీవితంపై విరక్తి చెందిన ఒక యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆదివారం రాత్రి మండలంలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం..వేపూరికోట పంచాయతీ రెడ్డివారిపల్లెకు చెందిన వెంకటరమణారెడ్డి కుమారుడు ఉమామహేశ్వర్రెడ్డి(30)కి మూర్చ వ్యాధితో బాధపడుతున్నాడు. దీనివలనే తనకు వివాహం కావడం లేదని కుటుంబ సభ్యులతో వాపోయేవాడు. ఈ నేపథ్యంలో రాత్రి ఎర్రకాలువపల్లె వద్ద ఉన్న తమ వ్యవసాయ బోరు వద్దకు వెళ్లాడు. అక్కడ కూల్డ్రింక్లో పురుగుల మందు కలుపుకుని తాగి మృతి చెందాడు. సోమవారం ఉదయం ఇది వెలుగులోకి రావడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్ఐ ఈశ్వరయ్య కేసు నమోదు చేశారు.
పోలీసులు విచారణకు పిలిచారని ఆత్మహత్యాయత్నం
మదనపల్లె సిటీ: ఓ వివాహిత కిడ్నాప్ కేసులో విచారణకు పోలీసు స్టేషన్కు పోలీసులు రమ్మనడంతో టెన్షన్ పడిన ఓ యువకుడు ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. సోమవారం ఈ సంఘటన కురబలకోట మండలం ఎర్రమద్దువారిపల్లెలో చోటుచేసుకుంది. బాధితుని కథనం...ములకలచెరువు మండలం చిట్టెంవారిపల్లెకు నాగార్జున(26)ను ఓ కేసు విషయంపై ముదివేడు పోలీసులు స్టేషన్కు రమ్మని ఫోన్ చేశారు. ఆదివారం పోలీసుస్టేషన్కు వెళ్లాడు. స్టేషన్లో ఎస్ఐ లేకపోవడంతో ఎర్రమద్దువారిపల్లెలోని అమ్మమ్మ ఇంటికి వెళ్లాడు. సోమవారం పోలీసులు స్టేషన్కు రమ్మని మళ్లీ ఫోన్ చేయడంతో తీవ్ర మనస్తాపం చెందాడు. పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు. చికిత్సతో అతను కోలుకుంటున్నాడు. ఈ ఘటనపై ముదివేడు ఎస్ఐ నెట్టికంఠయ్య వివరణ కోరగా.. విచారణకు స్టేషన్కు రావాలని కోరామేగానీ తాము ఎలాంటి వేధింపులకు గురి చేయలేదన్నారు.