గుంటూరు జిల్లాలో దారుణం

Man Burnt Alive in Guntur in Horrible Road Accident - Sakshi

సాక్షి, గుంటూరు : జిల్లాలో దారుణం జరిగింది. చిలకలూరిపేట నియోజకవర్గం ఎడ్లపాడు మండలంలో జాతీయరహదారిపై బైక్‌ లారీ ఢీకొట్టుకున్న ఘటనలో ఒకరు సజీవదహనం అయ్యారు. మిట్టాపల్లి కాలేజీ సమీపంలో అర్ధరాత్రి సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. నెల్లూరు నుంచి గుంటూరు వైపు వెళ్తున్న చేపలలోడు లారీ సర్వీసు రోడ్డు నుంచి హైవే మీదకు వస్తున్న బైక్‌ను ఢీ కొట్టింది. సుమారు 100మీటర్లు బైక్‌ని ఈడ్చుకెళ్లింది. ఈ క్రమంలో బైక్ పెట్రోల్ ట్యాంక్ పేలి లారీకి మంటలు అంటుకున్నాయి. దీంతో బైక్‌ మీదున్న నరేష్‌ అనే వ్యక్తి శరీరం కాలిపోయి తీవ్రగాయాలయ్యాయి. వెంటనే గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా.. చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలాడు. ఘటనలో గాయపడ్డ మరొకరికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ప్రమాదంలో లారీ ఇంజన్ ముందుభాగం దగ్దమైంది. ఫైర్‌సిబ్బంది మంటల్ని అదుపు చేశారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top