భార్యను హత్య చేసి.. హత్యకు గురయ్యాడు

UP Man Beaten To Death By Villagers - Sakshi

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. భార్యను హత్య చేసిన వ్యక్తిని గ్రామస్తులు అత్యంత కిరాతంగా దాడి చేసి హతమార్చారు. ఈ ఘటన ఫతేపూర్‌ జిల్లాలో శనివారం చోటుచేసుకుంది. వివరాలు. జిల్లాకు చెందిన నషీర్‌ ఖురేషీ శుక్రవారం తన భార్యను హత్య చేశాడు. ఈ విషయం శనివారం సాయంత్రం గ్రామస్తులకు తెలిసింది. దీంతో అతను పారిపోవడానికి ప్రయత్నించాడు. విషయం తెలుసుకున్న ఖురేషీ భార్య తరఫున బంధువులు తొలుత అతనిపై రాళ్ల దాడికి పాల్పడి తీవ్రంగా గాయపరిచారు. అప్పటికే అపస్మారక స్థితికి చేరుకున్న ఖురేషీని ఇసుప రాడ్లు, కర్రలతో కొట్టి హతమార్చారు. నడిరోడ్డుపై అతన్ని విచక్షణారహితంగా కొట్టి చంపుతున్నా.. అక్కడున్న వారు ఎవ్వరూ ఆపే ప్రయత్నం చేయలేదు. స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న పోలీసులు భార్య, భర్తల మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టంకు తరలించారు. ఖురేషీని హత్య చేసిన వారిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top