ఐదుపదుల వయసులో ఇదేం పాడుబుద్ధి

Man Arrest in Molestation on Girl - Sakshi

 మైనర్‌ బాలికకు నీలి చిత్రాలు చూపుతున్న కామాంధుడు

కారం చల్లి చితకబాదిన స్థానికులు  

అల్వాల్‌: మైనర్‌ బాలిక వెంటపడుతూ వేధిస్తున్న  50 సంవత్సరాల వ్యక్తిని స్థానికులు పట్టుకొని దేహశుద్ధి చేసి అల్వాల్‌  పోలీసులకు అప్పగించారు.  సీఐ మట్టయ్య, స్థానికులు తెలిపిన మేరకు.. అల్వాల్‌ సూర్యనగర్‌లో నివసించే 12 సంత్సరాల బాలికను గత కొన్ని రోజులుగా సుభాష్‌నగర్‌కు చెందిన దశరథ్‌(50) కొంత కాలంగా వెంటపడుతూ మాయమాటలు చెబుతూ మచ్చిక  చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలో తనవద్ద ఉన్న సెల్‌ఫోన్‌ను చూపిస్తూ అందులో నీలి చిత్రాలు బాలికకు చూపించసాగాడు. కంగారు పడిన బాలిక ఈ విషయం తల్లిదండ్రులకు చెప్పడంతో వారు ఎలాగైన నిందితుడిని పట్టుకోవాలని భావించి ఆదివారం ఇంటివద్దే ఉన్నారు.

రోజు మాదిరిగా ఆదివారం ఉదయం కారులో వచ్చిన దశరథ్‌ బాలికను పిలిచి తనవద్ద ఉన్న సెల్‌ఫోన్‌ను చూపి మభ్యపెట్టడానికి ప్రయత్నించసాగాడు. ఈ సమయంలో బాలిక తల్లిదండ్రులు వచ్చి నిందితుడి సెల్‌ఫోన్‌ లాకొని చూడగా అందులో నీలి చిత్రాలు కనిపించాయి. దీంతో ఒక్కసారిగా కోపొద్రిక్తులైన తల్లిదండ్రులు గట్టిగా అరవడంతో స్థానికులు గుమ్మిగూడి దశరథ్‌కు దేహశుద్ధి చేశారు. ఒంటిపై కారం పోసి చితక్కొట్టారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కోస్కో సెక్షన్‌ 354 డి ప్రకారం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిని అదుపులోకి తీపుకొని కారును స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని బాలల హక్కుల సంఘం గౌరవ అధ్యక్షులు అచ్యుతరావు డిమాండ్‌చేశారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top