భర్తను చంపి మహిళపై ఘాతుకం

Madhya Pradesh Woman Molested By Friends At Home - Sakshi

భోపాల్‌ : సరదాగా పార్టీ చేసుకునేందుకు స్నేహితుడి ఇంటికి వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఫ్రెండ్‌ భార్యపై లైంగిక దాడికి పాల్పడి అడ్డుకున్న భర్తను అమానుషంగా హత్య చేసిన ఘటన మధ్యప్రదేశ్‌లోని విదిశ జిల్లాలో వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పార్టీ చేసుకుందామని బాధిత మహిళ ఇంటికి సోమవారం ఇద్దరు వ్యక్తులు వెళ్లారు. గ్రామానికి చెందిన సునీల్‌ కుష్వహ, మనోజ్‌ అహిర్వార్‌లు తమ స్నేహితుడి ఇంటికి వెళ్లి ముగ్గురూ కలిసి పీకల్లోతు మద్యం సేవించారు. మద్యం మత్తులో స్నేహితుడి భార్యపై సునీల్‌ లైంగిక దాడికి పాల్పడ్డాడు. భర్త అడ్డగించడంతో మరో వ్యక్తి మనోజ్‌అహిర్వార్‌ స్నేహితుడని కూడా చూడకుండా బాధితుడిని దారుణంగా హత్య చేశాడు. మహిళ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితులను అదుపులోకి తీసుకునేందుకు గాలింపు చర్యలు ముమ్మరం చేశామని పోలీసులు తెలిపారు. కాగా తనపై లైంగిక దాడి అనంతరం నిందితుడు తనను తీవ్రంగా గాయపరిచాడని బాధిత మహిళ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top