ప్రేమికుల బలవన్మరణం

Lovers Commits Suicide in Tamil nadu - Sakshi

చెన్నై , అన్నానగర్‌: పళణి సమీపంలో ఆదివారం ప్రేమికులు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. దిండుక్కల్‌ జిల్లా పళణి తట్టాన్‌కులం ప్రాంతానికి చెందిన శక్తివేల్‌. ఇతని కుమార్తె మోహన ప్రియ (20). ఈమె ఆయక్కుడి ప్రాం తానికి చెందిన పాండియరాజన్‌ రెండు సంవత్సరాల కిందట ప్రేమించి వివాహం చేసుకున్నారు. వీరికి ఒకటిన్నర ఏళ్ల వయస్సు గల మణిమేఘలై అనే కుమార్తె ఉంది. ఈ స్థితిలో గత నాలుగు నెలల కిందట దంపతుల మధ్య అభిప్రాయభేదాలు ఏర్పడింది. దీంతో మోహనప్రియ పుట్టిం టికి చేరుకుంది. ఈస్థితిలో మోహనప్రియకి, పాత ఆయక్కుడి 7వ వార్డు ప్రాంతానికి చెందిన కార్తిక్‌ (21)తో పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధానికి దారితీసింది.

ఈ స్థితిలో శనివారం సాయంత్రం కార్తీక్‌ తోటలో అతన్ని మోహనప్రియ కలిసింది. ఆ సమయంలో తనను వివాహం చేసుకోవాల్సిందిగా కార్తిక్‌పై  ఒత్తిడి చేయడంతో వాగ్వాదం ఏర్పడింది. అనంతరం తోటలో ఉన్న పురుగుల మందును మోహన ప్రియ తాగింది. దిగ్భ్రాంతి చెందిన కార్తిక్‌ ఆమెని చికిత్స కోసం పళణి ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చాడు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మోహన ప్రియ మృతి చెందింది. దీంతో మనస్తాపం చెందిన కార్తిక్‌ మద్యంలో పురుగుల మందు కలిపి తాగాడు. అతన్ని బంధువులు చికిత్స కోసం పళణి ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే కార్తిక్‌ మృతి చెందాడు. దీనిపై ఆయక్కుడి పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top