అడవిపందిని ఢీకొట్టి వ్యక్తి దుర్మరణం

A Lecturer Died By Dashing Wild Boar Near Kollapur - Sakshi

సాక్షి, పెద్దకొత్తపల్లి (కొల్లాపూర్‌): ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఓ వ్యక్తి అకస్మాత్తుగా వచ్చిన అడవిపందిని ఢీకొట్టడంతో కిందపడి మృతిచెందాడు. ఈ సంఘటన మండలంలోని ముష్టిపల్లి గేట్‌ సమీపంలో చోటుచేసుకుంది. వివరాలిలా.. లింగాల మండలం అంబట్‌పల్లికి చెందిన ఆవుల శంకర్‌(40) తన ద్విచక్రవాహనంపై గురువారం తెల్లవారుజామున నాగర్‌కర్నూల్‌ వెళ్తున్నాడు. ఈ క్రమంలో ముష్టిపల్లి గేట్‌ సమీపంలో అకస్మాత్తుగా అడవిపంది అడ్డం రావడంతో ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో కిందపడిన శంకర్‌ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందాడు. ఈయన నాగర్‌కర్నూల్‌లోని ఓ ప్రైవేట్‌ కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేస్తున్నాడు. శంకర్‌కు భార్య జ్యోతి, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
 
స్వగ్రామంలో విషాదఛాయలు 
లింగాల (అచ్చంపేట): మండలంలోని అంబట్‌పల్లికి చెందిన ఆవుల శంకర్‌ రోడ్డు ప్రమాదంలో మృతిచెందడంతో స్వగ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. నాగర్‌కర్నూల్‌లో ఓ ప్రైవేటు కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేస్తున్నాడు. శంకర్‌ ఆకస్మిక మృతితో సర్పంచ్‌ నాగ రవిశంకర్, పలువురు గ్రామపెద్దలు బాధిత కుటుంబాన్ని పరామర్శించి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.  
 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top