భార్య శవంతో మూడు రోజులు..

Kolkata Man Found Living With Wife Corpse For Three Days - Sakshi

కోల్‌కతా : భార్య శవాన్ని ఇంట్లో ఉంచుకొని ఓ భర్త ఆ శవంతో మూడు రోజులు కలిసి ఉన్న సంఘటన పశ్చిమబెంగాల్‌లోని నడియా జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నడియా జిల్లా చక్దా ప్రాంతానికి చెందిన బచ్చు చందా భార్య భారతి చందా(50)తో కలిసి నివాసం ఉంటున్నారు. కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న భారతి చందా.. ఇటీవల మృతి చెందింది. అయినప్పటికీ ఈ విషయాన్ని బచ్చు చందా ఎవరికి తెలియజేయలేదు. మూడు రోజులపాటు శవం ఇంట్లోనే ఉంది. ఇంట్లో నుంచి కుళ్లిపోయిన వాసన రావడం.. భారతి కనిపించకపోవడంతో బచ్చు చందాను స్థానికులు నిలదీశారు. ఆయన ప్రవర్తన పట్ల అనుమానం వచ్చి ఇంట్లోకి వెళ్లి చూడగా.. కుళ్లిపోయిన శవం కనిపించింది. స్థానికుల సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాన్ని స్థానిక ఆస్పతికి తరలించారు. బచ్చు చందాను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు. అతని మానసిక స్థితి సరిగా లేదని స్థానికులు చెప్పడం గమనార్హం.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top