తండ్రి మందలించాడని  విద్యార్థి ఆత్మహత్య

Intermediate Student Suicide In Visakhapatnam - Sakshi

చీడికాడ(మాడుగుల): చదువుకోమని తండ్రి మందలించడంతో మనస్తాపానికి గురైన ఓ విద్యార్థి గన్నేరు పిక్కలు నూరుకొని తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. బాధిత కుటుంబసభ్యులు అందించిన వివరాలిలా ఉన్నాయి. చీడికాడకు చెందిన రెడ్డి రమణకు ఇద్దరు కుమారులు. చిన్న వాడైన కోటి(17) విశాఖలోని డిఫెన్స్‌ అకాడమీలో ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం ఎంపీసీ చదువుతున్నాడు.   కోటికి చదువుపై అంతగా అసక్తి లేదు. దీంతో ఇన్‌స్టిట్యూట్‌కి సక్రమంగా వెళ్లేవాడు కాదు. దీంతో తండ్రి రమణ తరుచూ మందలించే వాడు. ఇదే విధంగా మంగళవారం ఉదయం ఇన్‌స్టిట్యూట్‌కి వెళ్లాలని  కోటిని తండ్రి మందలించాడు.

దీంతో మనస్తాపానికి గురైన కోటి గన్నేరు పిక్కలు నూరుకొని తాగి బస్సేక్కి విశాఖలో ఇన్‌స్టిట్యూట్‌ వెళ్లిపోయాడు.అక్కడికి వెళ్లే సరికి వాంతులు కావడంతో ఇనిస్టిట్యూట్‌ సిబ్బం ది కోటిని కేజీహెచ్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందాడు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని అప్పగించడంతో బుధవారం మధ్యాహ్నం చీడికాడలో అంత్యక్రియలు నిర్వహించారు. అందరితో కలివిడిగా తిరిగే కోటి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. ఎస్‌ఐ సునీల్‌కుమార్‌ని సంప్రదించగా సంఘటన విశాఖలో జరగడంతో గాజువాక పోలీసులు కేసునమోదు చేసినట్టు తెలిపారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top