ఆర్ఎఫ్సీఎల్లో ప్రమాదం కార్మికుడికి గాయాలు
గోదావరిఖని(రామగుండం): రామగుండం ఫర్టిలైజర్ కెమికల్స్ లిమిటెడ్ (ఆర్ఎఫ్సీఎల్) కంపెనీలో శుక్రవారం ప్రమాదం జరిగింది. రఘు అనే కాంట్రాక్టు కార్మికుడికి గాయాలయ్యాయి. సింధా కంపెనీకి సంబంధించి సిమెంట్, కంకరను కలిపి పంపించే బ్లాటింగ్ ప్లాంట్లో రెండు బ్రేకర్లు ఉండగా, ఒక బ్రేకర్లో గట్టి పడిన సిమెంట్ను తొలగించిన తర్వాత మరో బ్రేకర్లో పనిచేయాల్సి ఉంటుంది. అయితే ఒక బ్రేకర్లో పనులు చేస్తుండగా అదే బ్రేకర్ను అపరేటర్ నడిపించడంతో రఘు పనిస్థలంలో కిందపడ్డాడు. దీంతో అతని రెండు కాళ్లకు, చేతులకు గాయాలయ్యాయి. వెంటనే చికిత్స నిమిత్తం కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు.