ఎదురు కాల్పుల్లో నేరస్తుడికి గాయాలు
బరంపురం: గంజాం పోలీ సులు జరిపిన ఎదురు కాల్పుల్లో మోస్ట్వాంటెడ్ క్రిమినల్ కున్నా బెహరా అలియాస్ జు ధిష్టర్ బెహరా గాయాలపాలయ్యాడు. గాయాలపాలైన కున్నా బెహరా నుంచి నాటు తుపాకీ, మొబైల్, బైక్ను పో లీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా బరంపురం ఎస్పీ పినాకి మిశ్రా అందించిన సమాచారం ప్రకారం వివరాలిలా ఉన్నాయి.
సదర్ పోలీస్స్టేషన్ పరిధిలో గల టమ్మనా జంగిల్లో పోలీసుల లిస్ట్లో మోట్వాంటెడ్గా తప్పించుకు తిరుగుతున్న కరుడుగట్టిన నేరస్థు డు కున్నా బెహరా తలదాచుకున్నాట్లు సమాచారం అందుకున్న బరంపురం ఎస్పీ పినాకి మిశ్రా ఆదేశంతో గొళంతరా, సదర్ పోలీస్స్టేషన్ అధికారులు రెండు బృందాలుగా బుధవారం మధ్యాహ్నం టమ్మన జంగిల్కి వెళ్లారు.
పోలీసులు వచ్చినట్లు పసిగట్టిన నేరస్థుడు కున్నా బెహరా తొలుత పోలీసులపై కాల్పులు జరిపారు. పోలీసులు ఆత్మరక్షణగా ఎదురు కాల్పులు జరపడంతో కున్నా బెహరా కుడి కాలికి గాయాలయ్యాయి. గాయాలపాలైన కున్నా బెహరా దగ్గర నుంచి ఒక నాటు తుపాకీ, 3 పేలని గుళ్లు, ఒక మొబైల్, బైక్ను పోలీసులు స్వాధీ నం చేసుకున్నారు.
అనంతరం కున్నా బెహరాను ఎంకేసీజీ మెడికల్ కళాశాల ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. కున్నాబెహరా పై సదర్, గొళంతరా పోలీస్స్టేషన్లలో సుమారు 18 దోపిడీ, దొంగతనా లు, హత్యాయత్నం వంటి కేసులు ఉన్నాయని ఎస్పీ వివరించారు.