ఆలస్యంగా ఇంటికొస్తోందని భార్యను హత్యచేసిన భర్త
సాక్షి, ముంబై : వేరే ఇళ్లలో పాచిపనులకు వెళ్లి ఇంటికి ఆలస్యంగా వస్తుందని ఆగ్రహానికి గురై కట్టుకున్న భార్యను భర్త గొంతు కోసి హత్యచేసిన సంఘటన పుణేలో చోటుచేసుకుంది. స్థానిక సాంగ్వీ పోలీసు స్టేషన్ సీనియన్ ఇన్స్పెక్టర్ జ్ఞానేశ్వర్ సాబ్లే అందించిన వివరాల ప్రకారం.. శైలా లోఖండే (40) తమకు దగ్గరలో ఉన్న పలు ఇళ్లలో పాచి పనులు చేస్తుండేంది. ఇంటికి ఆలస్యంగా వస్తుండటంతో భర్త హనుమంత్ లోఖండే (58) తరుచూ భార్యతో గొడవ పడేవాడు. చివరకు ఆమెపై కోపం పెంచుకున్న భర్త సోమవారం గొంతు కోసి హతమార్చాడు. సాంగ్వీ పోలీసులు ఆతన్ని అదుపులోకి తీసుకున్నారు.