భార్యపై కత్తితో దాడి.. పరిస్థితి విషమం

Husband Attacked Wife With Knife - Sakshi

రంగారెడ్డి: షాద్‌నగర్‌ పట్టణంలోని నెహ్రూనగర్‌ కాలనీలో దారుణం చోటుచేసుకుంది. కట్టుకున్న భార్యపై భర్త కత్తితో దాడి చేశాడు. స్థానికంగా నివాసముంటున్న అర్మన్‌, మూసుఖాన్‌లు దంపతులు. భార్యాభర్తల మధ్య ఓ విషయంలో వివాదం చెలరేగడంతో కోపంలో భార్యపై భర్త అర్మన్‌ కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో భార్య మూసుఖాన్‌ తీవ్రంగా గాయపడింది. భార్య పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది. ఆమెను చికిత్స నిమిత్తం షాద్‌నగర్‌ కమ్యూనిటీ ఆసుపత్రికి తరలించారు. స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top