హీరా గోల్డ్ కేసు: రంగంలోకి కిరాయి హంతక ముఠా
సాక్షి, హైదరాబాద్ : సంచలనం సృష్టించిన హీరా గోల్డ్ కేసులో కిరాయి హంతకులు రంగంలోకి దిగారు. నౌహీరాపై ఫిర్యాదు చేసినా, సాక్ష్యం చెప్పటానికి వచ్చినా చంపేస్తామంటూ బెదిరింపులకు దిగుతున్నారు. సోషల్ మీడియా ద్వారా రివాల్వర్తో బాధితుల సెల్ఫోన్కు బెదిరింపు వీడియోలు పంపుతున్నారు. సదరు బాధితులు పోలీసులను ఆశ్రయించి వీడియో ఫోటేజీలను వారికి అందించారు.
దీంతో బెదిరింపులకు పాల్పడుతున్న వారిని పట్టుకోవటానికి ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. హీరా కేసులో పోలీస్ స్టేషన్కు, కోర్టుకు వెళ్లాలంటే బాధితులు బెదిరిపోతున్నారు. హీరా గోల్డ్ కేసులో ఉగ్రవాదుల పెట్టుబడులు సైతం ఉన్నట్లు సీఐడీ అనుమానం వ్యక్తం చేస్తున్నవిషయం తెలిసిందే.