విశాఖ ఎయిర్‌పోర్టులో బంగారం పట్టివేత

సాక్షి, విశాఖపట్నం: విశాఖ ఎయిర్‌పోర్టులో శుక్రవారం బంగారం పట్టుబడింది. కస్టమ్స్‌ అధికారులు విశాఖ ఎయిర్‌పోర్టులో తనిఖీలు చేస్తుండగా ఓ ప్రయాణికుడిని అనుమానించి సోదా చేశారు. దుబాయి నుంచి వచ్చిన ఆ ప్రయాణికుడి వద్ద 350 గ్రాముల బంగారం ఉండడంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు. బంగారాన్ని స్వాధీనం చేసుకుని విచారణ చేపడుతున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top