బీహార్లో గ్యాంగ్రేప్
పాట్నా: విధులు పూర్తి చేసుకొని ఆటోలో ఇంటికి వస్తున్న మహిళపై ఆటో డ్రైవర్తో పాటు మరో వ్యక్తి కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన బీహార్లో శనివారం రాత్రి చోటుచేసుకుంది. వైశాలీ జిల్లాలోని హజీపుర పట్టణానికి చెందిన ఓ మహిళ పాట్నాలోని ఓ హైకోర్టు న్యాయవాది ఇంట్లో పని చేసుకుంటూ జీవనం సాగిస్తోంది.
ఆదివారం సెలవు కావడంతో శనివారం రాత్రి స్వగ్రామమైన హాజిపురకు ఆటోలో వెళ్తుండగా.. కేలా బజార్ సమీపంలోని నిర్మానుష్య ప్రదేశాకి రాగానే ఆటోడ్రైవర్తో పాటు మరో వ్యక్తి కలిసి ఆమె పై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. అనంతరం ఈ విషయం ఎవరికైనా చెబితే తీవ్ర పర్యవసనాలు ఉంటాయని బెందిరించి అక్కడి నుంచి పరారయ్యారు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.