వాట్సప్లో అసభ్యకర ఫొటో.. యువతి ఆత్మహత్య
ప్రియుడి కోసం పోలీసుల గాలింపు
సాక్షి, చెన్నై : ప్రియుడితో సన్నిహితంగా గడిపిన ఫొటో వాట్సప్లో వైరల్ కావడంతో మనస్తాపానికి గురైన యువతి శనివారం విషం తాగి ఆత్మహత్య చేసుకుంది. అరియలూరు జిల్లా సెందురై సమీపం నమంగునం గ్రామానికి చెందిన చుడర్మణి(35) చెన్నై కోయంబేడు మార్కెట్లో పని చేస్తున్నారు. ఇతని భార్య సంగీత (27). చుడర్మణితో నమంగుణం గ్రామానికి చెందిన శరవణన్(36) కోయంబేడు మార్కెట్లో పని చేస్తున్నారు. ఒకే గ్రామానికి చెందిన వారు కావడంతో ఇరువురు సన్నిహితంగా మెలిగారు. ఇరువురు సొంతూరుకు వెళ్లినప్పుడు తరచుగా కలుసుకునేవారు. ఆ సమయంలో చుడర్మణి భార్య సంగీతకు శరవణన్కు వివాహేతర సంబంధం ఏర్పడింది. ఇరువురు గ్రామానికి వచ్చిన సమయంలో చుడర్మణికి మద్యం తాపించి, అతని భార్యతో శరవణన్ గడిపేవాడు. ఈ విషయం చుడర్మణికి తెలియడంతో భార్య భర్తల మధ్య వాగ్వాదం జరిగింది. గత ఏడాదిగా భర్తతో విడిగా ఉంటుంది.
ఇలా ఉండగా, శరవణన్ సంగీతను తనతో గడపమని ఒత్తిడి చేశాడు. లేకుంటే ఆమెతో గడుపుతున్న ఫొటోను వాట్సప్లో విడుదల చేస్తానని బెదిరించాడు. అంతేకాకుండా గత 19వ తేదీ సంగీత బంధువు అరివళగన్కు వాట్సాప్ ద్వారా ఈ ఫొటోను షేర్ చేశాడు. ఈ విషయం తెలియడంతో సంగీత, తల్లితోపాటు విషం తాగి ఆత్మహత్యకు ప్రయత్నించింది. దీంతో ఇద్దరిని తంజావూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించారు. దీని గురించి సంగీత తండ్రి పెరియ స్వామి పోలీసులకు గత 23వ తేదీ ఫిర్యాదు చేసినా, పోలీసులు చర్యలు తీసుకోలేదని తెలిపాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సంగీత మృతి చెందింది. దీని గురించి సెందురై పోలీసులు కేసు నమోదు చేసి, పరారీలో ఉన్న శరవణన్ కోసం గాలిస్తున్నారు.
సంబంధిత వార్తలు