శుభకార్యానికి వెళ్లి..తిరిగి వస్తుండగా..

Elderly Woman Died In Car Accident East Godavari - Sakshi

అదుపుతప్పి చెట్టును ఢీకొన్న కారు

వృద్ధురాలి మృతి,నలుగురికి గాయాలు

చింతూరు: శుభకార్యానికి వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో వారు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి చెట్టుకు ఢీకొనడంతో ఓ వృద్ధురాలు మృతి చెందగా, ఐదుగురికి గాయాలయ్యాయి. చింతూరు మండలం బొడ్డుగూడెం వద్ద బుధవారం అర్ధరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. తెలంగాణా రాష్ట్రం భద్రాచలంలోని భూపతిరావు కాలనీకి చెందిన తాళ్లూరి జయలక్ష్మి(80) కుటుంబంతో కలసి కారులో రాజమహేంద్రవరంలోని తన చెల్లెలి షష్ఠిపూర్తి కార్యక్రమానికి వెళ్లారు. కార్యక్రమం అనంతరం వారు భద్రాచలం తిరిగి వెళ్తుండగా చింతూరు మండలం బొడ్డుగూడెం వద్ద వారు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి చెట్టుకు ఢీకొట్టింది. ఈ ఘటనలో జయలక్ష్మి గుండెపోటుతో ఘటనాస్థలంలోనే మృతిచెందగా బిందుమాధవి, చిన్నారులు ఆకాంక్ష, అవంతికలతో పాటు డ్రైవర్‌ దుర్గాప్రసాద్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వీరికి ఏడుగురాళ్లపల్లి ప్రాథమిక ఆసుపత్రిలో చికిత్స నిర్వహించిన అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం భద్రాచలం తరలించారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top