రాజమండ్రిలో మళ్లీ డ్రగ్స్‌ కలకలం

సాక్షి, రాజమండ్రి: తూర్పుగోదావరి జిల్లాలో  మరో డ్రగ్స్‌ ముఠా గుట్టురట్టు అయింది. జిల్లా కేంద్రం రాజమండ్రిలో డ్రగ్స్‌ ముఠాను శనివారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డ్రగ్స్‌పై పక్కా సమాచారం అందుకున్న పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ సోదాల్లో ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ. 3 లక్షల విలువ చేసే మాదక ద్రవ్యాలు, ఇంజెక్షన్లు స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్‌ సరఫరాపై పోలీసులు విచారణ చేస్తున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top