కిరోసిన్ పోసుకుని యువతి ఆత్మహత్య
నాగారం (తుంగతుర్తి) : ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఓ యువతి బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన మండలంలోని మాచిరెడ్డిపల్లిలో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మాచిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన వడ్డె యాదగిరి దంపతులకు ముగ్గురు కుతూళ్లు ఉన్నారు. పెద్ద కూమార్తె వడ్డె నర్మద (22) సూర్యాపేటలోని ఓ కళాశాలలో డిగ్రీ తృతీయ సంవత్సరం చదువుతోంది. ఇటీవల తల్లీదండ్రులు నర్మదకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు.
పెళ్లిపై ఆసక్తిలేక నర్మద తీవ్ర మనస్తానపానికి గురైంది. ఈ నేపథ్యంలోనే ఇంట్లో ఎవరూలేని సమయంలో కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. మంటలకు తాళలేక కేకలు వేయడంతో ఇరుగుపొరుగు వారు గమనించి తల్లిదండ్రికి సమాచారం ఇచ్చారు. వెంటనే నర్మదను సికింద్రాబాద్లోని గాంధీ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శ్రీనివాస్ తెలిపారు.